నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Tuesday, June 14, 2011

తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా!

పురాణాలలో యోగులు, చక్రవర్తులు లోక కళ్యాణ కాంక్షతో రాజ్యాన్ని, సంసార తాపత్రయాలు త్యజించి సంవత్స్తరాలు, సంవత్స్తరాలు తపస్సు ఆచరించేవారట! ఒక్కోసారి అవి వింటున్నప్పుడు పురాణాలూ నమ్మశక్యం కాని రీతిలో వర్ణించబడ్డట్టు మనసుకు తోస్తుంది. కారణం మనిషన్నవాడు తన గురించి ఆలోచించకుండా కేవలం పరుల కోసమే ఆలోచించడం ఎలా సాధ్యం అన్న మీమాంశ ఆ నిజాన్ని మనం నమ్మలేని విధంగా అలోచిoప చేసేటట్టు చేస్తుంది.
ఒక రోజులో కనీసం కొంతసేపైనా కేవలం అవతలి వాళ్ళకోసం ఆలోచించడం అన్నది ఉహకైనా అందుతుందా?మనల్ని ఆ స్థానంలో ఉహించుకుంటే 99 ,9 % మంది చివరి వరసలో చిట్ట చివర నిలిచే వాళ్ళమే.
ఈ సోది రామాయణం చాట భరతం ఎందుకంటే ఈరోజు చదివిన వార్త మనసుకు కదిలించి వేసింది.దాని సారంశం హరిద్వార్ కు చెందిన ఒక సాధుపుంగవుడు గంగా నది పరిరక్షణకు నడుం బిగించి నాలుగు నెలలుగా నిరాహార దీక్ష చేస్తూ గతించాడు.ఆ మహనీయుడు మరణించాక కాని మనకు ఈ వార్త తెలియలేదంటే ఏమనుకోవాలి.ఇది జరిగింది హిందుత్వ పరిరక్షణకే మేమున్నది అని బీరాలు పలికే BJP పాలిత రాష్ట్రంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే సామాన్యుడికి ఒరిగేది ఏమి లేదు. దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్టు మన మీద పడి కోట్లకు పడగలేత్తుతారు.మనం కూడా ఇంతకంటే చేయగలిగేది లేదు.ఎవడికో ఒకడికి ఓటు వేయడం తప్పించి.అందరూ ఆ విషవృక్షపు కొమ్మలే.
అప్పుడప్పుడు ఒక హజారే రాందేవ్ వచ్చి వారి శక్తి మేర పోరాడి నిష్క్రమిస్తారు.ఈ పరిణామంలో ఆ తరపు ప్రతినిధులు కోల్పోవడం తప్పించి.ఈ తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా.

http://timesofindia.indiatimes.com/india/Sadhu-dies-after-4-month-fast-to-save-the-Ganga/articleshow/8847216.cms

Thursday, March 10, 2011

బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివారు

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ so called ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై tankbund విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన exams .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

Thursday, February 24, 2011

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు
అవును మరి వాళ్ళు ఎత్తుకేళ్ళకుండా ఉంటె ఇంతటి నిజాయితీ ఉన్న ఐఏఎస్ లు ఇంకా మన దేశం లో ఉన్నారని తెలిసేదే కాదు. మన వార్తా పత్రికలూ కూడా ఎప్పుడు 360 కోట్లు అవనితి సంపాదన పొందిన ఐఏఎస్ ల గురించే హెడ్డ్ లైన్స్ లో ప్రచురించడం మాత్రమే తెలిసిన వార్తా పత్రికలకి ఒక నిజయితిపరుడైన అధికారి వార్త ప్రచురించే భాగ్యం కలిగి ఉండేది కాదు.
ఏదో ఒక AD లో మరక మంచిదే అని ఉంటుంది.మరక వల్ల ఏదైనా ఒక మంచి జరిగితే అది మంచిదే. అలానే ఈ నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళడం వల్ల యావత్ భారతావనికి అతని గొప్పదనం తెలిసే భాగ్యం కలిగింది. ఈ సందర్భం లో అక్కడి ప్రజానీకం తెలిపిన సంఘీభావం ఎంతో ముదావహం. అదే సమయంలో మీడియా కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు TRP ratings కోసం తాపత్రయ పడే వీళ్ళు ఇటువంటి అధికారులు చేసే మంచి పనులు వెలుగులోకి తీసుక రావడం లో ఎందుకు ముందు ఉండరు. ఈ వరవరరావు పనికి మాలిన రావులను ఎందుకు చూపించి జనాల BP లను ఎందుకు పెంచుతారో వారికే అర్ధం కావలి. వాళ్ల వల్ల ఒనకుడిన ఒక్క ప్రయోజనం ఎవరికైనా ఉందా. మైకు ముందు పనికిరాని పక్షపాత పూరిత వక్ర మాటలు తప్పించి.
ఓడిషా ప్రభుత్వం కూడా మరీ విషయాన్ని సాగదీయకుండా వల్ల డిమాండ్లు ఒప్పుకొని సమయోచితంగా ప్రవర్తించింది. ఇటువంటి నిజాయితీ అధికారుల్ని తాయారు చేయడం అంతటి సామాన్య విషయం కాదు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడుతారు.
I salute to Mr vineel krishna with high regard

Tuesday, February 15, 2011

ఎండమావిలో దాహం



సాగిపోతున్నా!
కనిపించే దారులు
కరిగిపోని ఇసుక తెన్నలు
మిగిలిపోఇన జ్ఞాపకాలు
గత జల సేతు బంధనమంటూ
అడుగులు సాగదీస్తూ
కాలం గడిపేస్తూ సాగిపోతున్నా!

ఉసులు మూగపోయిన సాయంత్రాన
చుక్కల్లో లెక్కలు నెమరు వేస్తూ
ప్రతిరోజు నను తాకిపోయే సంధ్య వెలుగు
తన గూడు చేరిందని తెలుసుకొని
భారమైన కనులు చేమ్మగిల్లడం మరిచిపోలేదని
ఉబుసుపోని మనసుకు
జోలపాట పాడి రోజులు సాగదీస్తున్నా !

ఒంటరి మనసుని బంధిచే పాశం ఉన్నదా
బహుదూరపు బాటసారికి దరిచేర్చే తీరం ఉన్నదా
మారనిదల్లా నిన్న నేడు ఆశలు రేపే రేపు అన్న ఒక గూడు మాత్రమే
తీరనిదల్లా ప్రతి తీరం వెంట ఎండమావిలో దాహం మాత్రమే

Monday, February 7, 2011

ఓడి గెలిచిన చిరంజీవి

అనగనగా ఒక సారు, ఆయన దగ్గర కోటాను కోట్లు సంపద ఉంది ప్రజాబలము ఉంది. కావలసినంతా వందమాగధులు ఉన్నారు. ఏదో చేయాలనీ ఆయన మనసు ఎంతకాలం నుంచో ఉవ్విళ్లూరుతోంది కాని ఏమి చేయాలో ఆయనకు పాలు పోలేదు.చేయల్సిందతా చేసేసాడు, కొడుక్కి, తమ్ముడిని మండలాలు పంచిచ్చేసాడు. ఇన్ని ఉన్నచోట బట్రాజు గణానికి కొదవే లేదు. ఇంతకంటే లాభసాటిగా ఒక కంపెనీ పెట్టు సారు దానిలో లాభపడ్డ వారే కాని పడిపోయిన వాళ్ళేవ్వరూలేరు. నిజమేనని నమ్మాడు అమాయక చక్రవర్తి. నమ్మకేమి చేస్తాడు ఏదో ఒకటి చేయాలన్న తొందర ఆయనలో చాల ఉంది. పైగా live examples కూడా చాలానే ఉండనయే, అంతకు మునుపు ఒక అన్న కూడా ఇలానే ఒక చక్రం కూడా తిప్పడాయే! ఆయన 9 నెలల్లో చేస్తే నీవు 8 చేస్తావన్న వాళ్ళే ఎక్కువయ్యారు. ఇంకేంటి అమ్ములపొది సిద్దం చేసుకున్నాడు సామాజిక అంశం, ప్రేమే దైవం సేవే లక్ష్యం వందకు వంట చెరుకు ప్రోడుక్ట్స్ అన్ని సిద్దమయ్యాయి


ఇదంతా ఒక రెండేళ్ళ ముందటి కథ. రేపెవ్వడు చూడోచ్చాడు. కలలు కల్లలయ్యాయి. ఓడలు బండ్లు అయ్యాయి.కన్న కలలన్ని కుదేలయ్యాయి. టైటానిక్ సినిమా చూడలనుకుంటాడు కాని టైటానిక్ షిప్ లో ఎవ్వడు ప్రయాణించాలనుకోడు కదా అదే జరిగింది. పెట్టిన కంపెనీ ఢమాలయ్యింది . ఉన్న సరకు మురుగుపోతోంది ఏం చేయాలో తోచలేదు. రంగు పడి రంగు బారిన మొహం, మద్య మద్యలో రంగు వేసుకున్నోళ్ళు ఆకాశామార్గంలో విహరించడం కూడా మనసుకు ఉండబట్టకుండా చేసింది.పది దార్లు మూసుకపోతే ఒక దారి దేవుడు తెరుస్తాడాంట, ఊపిరి ఆడటానికి. ఎవరి కంపెనీకి పోటిగా తను దుకాణం తెరిచాడో ఆ పెద్ద కంపనీలో మేనేజర్ పోస్ట్ ఒకటి కాళి అయ్యింది అని తెలిసిందీ తడవుగా తొంగి చూడటం మొదలెట్టాడు. నీ స్థాయికి తగింది కాదన్నయ్య అనే చెప్పే వాడెవ్వడు లేకపోయే. ప్రతి ఒక్కడు బతకలేక బడిపంతులన్నట్టు గాలివాటంగా వచ్చిన వాడే కాని ఒక ఆలోచన పరుడే ఉంటే కదా.చెప్పే వాళ్ళే లేరు బట్రాజులు తప్ప. ఉన్నవాళ్లు ఎప్పుడో పోయారు, అదీ కాక రంగు వేసుకున్న మొహం కదా ఎక్కువ కాలం రంగు వేసుకోకుండా ఉండలేదు.రంగు వేసుకున్నప్పుడు అదికాక ఏదో వేరేది చేయాలన్న ఉబలాటం, కంపెనీ పెట్టాక రంగు వేయాలన్న ఆరాటం. ఎప్పుడు రెండు పడవల మీద కళ్ళు పెట్టే నైజమే! నీ ఆటే వద్దంటే పట్టుచీర కట్టుకోస్తా అని మొత్తానికి రంగ ప్రవేశం చేసాడు. అమ్ముడుపోని సరుకు అమ్మేశాడు. కాదు నమ్మకాన్ని వమ్ము చేసాడు. తిక్క సన్యాసులు అనుచరగణం.వాళ్ళకు మిగిలింది చిప్పే! కొట్లాటకు పుట్ట్లిలైన కాంగిరేసు కుటంబంలో కొత్త కాపురం మొదలెట్టిన ex ప్రజారాజ్యం గణానికి రాజ్య బాగం దక్కునో లేక ప్రజల్ని సామాజిక న్యాయం చేయమని ఈ అనుచరగణానికి ఇచ్చేసి రాజ్యాన్ని కాంగీయులు పంచుకుంటారో, వేచి చూడాలి.

ఒకానొక నాడు జెండా పీకేద్దాం అని శీర్షిక చూసి ఆంధ్రజ్యోతి పత్రిక ముందు నానా యాగీ చేసింది ఈ జనాలే. ఆత్మాహత్య సదృశమన్నట్టు పత్రికల మీద కారాలు మిరియాలు నూరింది ఈ నాయకుడే. హూట్!!!!! ఇంత తేలికగా మరి ఇంత ప్రయత్నలేమితో ఒక నాయకుడు ఓడిపోవడం సిగ్గుచేటు.ఇంతోటి నాయకుణ్ణి తివాసీలు వేసి నాయకత్వం అప్పగించడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే. ఎవడైనా కంపెనీ CEO కంపెనీ మూసేసి opponent కంపెనీ లో మేనేజర్ పోస్ట్ కి సరిపెట్టుకున్నట్టుంది వ్యవహారం. కందకు లేని దురద కత్తి పీటకున్నట్టుగా అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్లో వార్తలు కోసమెళ్లి అరగంట Ad ప్రోగ్రామ్స్ చూసి వళ్ళు మండి వార్తలు ఆపినట్టు పోస్ట్ రాసి చల్లార్చుకోవడమే!

Wednesday, November 24, 2010

అధిష్టానం తలనోప్పంటే మోకాలికి బానే వేసింది zandu balm

ఈ రెండు రోజుల హడావిడి వల్ల ఆంధ్ర జనాలకి ఒరిగిందేమీ లేదు కాలక్షేపం, కాసింత మసాల. ఆపుకోలేని ఆత్రుతని చల్లార్చుకోవడం తప్ప! ఏం చేద్దామని ఏం చేసిందో కాని ఈ అధిష్టానం తలనోప్పంటే మోకాలికి బానే వేసింది, zandu balm .
సందెట్లో సడేమియా లా తంతే బూరల బుట్టల పడ్డట్టైయింది కిరణు కుమారుడికి. యోగం భోగం రాసి పెట్టుంటే ఆపడం ఎవ్వరి తరము కాదు.
పాపం సమ్మె చేసే ఉద్యోగులు రోడ్డు బాట పట్టిన బీడి కార్మికులు వాళ్ళని పలకరించే నాధుడే లేకపోయాడు పేపర్లు మీడియా అంతా ఈ డ్రామా వెనకాతలే పడ్డారు . బీహారు ఎలెక్షన్ పలితాలు చూసినా కాని వాతకి మందు బర్నాల్ కాని zandu balm కాదని ఎప్పుడు గ్రహిస్తారో ఈ కాంగీయులు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే నాయకుడే కరువయ్యాడు కాంగిరేసు లో.ఈ కిరణుడి మీద ఆల్రెడీ ఎన్నో ఆరోపణలున్నాయి. బాబుకి మళ్ళి పనికి సిద్దం అవ్వాలి. పొద్దున్న లేస్తూనే ప్రబుత్వం మీద విరుచుక పడాలి కదా. చేత కాకపొతే దిగు దిగు అని రోశయ్య దిగే దాక అరిచి అలిసిపోయాడు ఇప్పుడు కిరణ్ మీద అరవాలి. ఎంతైనా బాబు వాసి రాసి అన్ని బాగున్నై. అయన ప్రతిపక్ష నాయకుడిగా ఎంత మంది CM లను చూస్తున్నాడో! CM లు మారతున్నారే కాని ప్రతిపక్ష నాయకుడిగా ఈయన స్థానం సుస్థిరం. తుమ్మితే ఉడే CM పదవి కన్నా కదలని opposition leader పోసిషన్ఏ బెటర్.
జగన్మోహనుడు కొత్త sketch తో రావాలి. ఆయన రాతలకి కోతలకి కొన్నాళ్ళు విరామం. తలకు కట్టిన బొప్పి కొంచెం మాడు పట్టాలంటే కొన్నాళ్ళాగాలి. మళ్ళి అయన బిజీ బిజీనే . కిరణు కుమారు కూడా బిజీ బిజీ అధిష్టానం ఆదేశాలణుగుణంగా నడుచుకొని అధిష్టానానికి కోట్లఅoదియాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక బంగారు బాతు గుడ్డు కాబట్టి. తెలంగాణా కాంగీయులు మాత్రం ఎప్పడి లాగ వాళ్ళ అజెండా వాళ్లకి ఉంటుంది. సోనియా అమ్మ, అధిష్టానం , అనవసర సమయాల్లో అక్కరకు రాని ఆవేశం బోరు కొట్టనే కొట్టవు. వాళ్లకవి పుష్కలంగా ఉన్నాయి. పూటకో బట్రాజు గీతం రోజుకో వీధి బాగోతం చూసి చూసి TV చూసే వాడికి బోరు కొట్టి ఎవ్వడి పాపాన వాడు పోతాడులే అని ఛానల్ మార్చి మనం మారాల్సిందే వీళ్ళు మారరు.

ఇంకో విధంగా ఆలోచిస్తే ఉన్న తుప్పు(క్కు) మంత్రి వర్గ ప్రక్షాళన చేయడానికి ఇదే ఒక మార్గంగా కూడా ఆలోచించి ఉండొచ్చు. కాని ఏ విధంగా చూసినా CM ఎంపిక సామాన్యుడి ఆశలకు అడియాసే. పాలడుగు వెంకట్రావు మద్యాహ్నం సామాన్యుడి లాగానే ఒక అడియాసని వ్యక్త పరిచాడు, మళ్ళి నేను కాoగ్రెస్సు వాడినని రొమ్ము విరబూచుకొని తిరిగే లెవెల్లో CM ఎంపిక ఉండాలని. నువ్వు నాకు నచ్చావ్ లో వెంకీ లాగ నీవు ఇస్తావు ఎందుకంటే basically నీవు మంచి GOD వి అని ఆశ పడినా మనం రోడ్డు మీద పదాలే కాని మన ఆశలు పైవాళ్ళ చెవుల్లో పడవు. ఓట్లు వేసేది మనం సీట్లు డిసైడ్ చేసేది పైవాళ్ళు. ఏముంది ఒక 2 రోజులుంటే అంతా షరా మామూలే. ABN ఛానల్ లో న్యూస్ ఆశించి ట్యూన్ చేస్తే 24 గంటల్లో 20 గంటలు మహా యంత్రం , గ్రీన్ టీ అని ప్రకటనలు వచ్చి కడుపులో తిప్పినట్టు ఒకటి కాకుంటే ఇంకో Ad ఉన్న ఛానల్ తిప్పిడం, అన్ని మనకు అలవాటే .

Saturday, October 23, 2010

ప్రతికారమే పరమసోపానం -నిజమే మరి ప్రతీకారం తీసుకున్నాక అలానే అనాలి

ప్రతికారమే పరమసోపానం - మహాభారతం ఇటువంటి ట్యాగ్ లైనుతో తోటి బ్లాగరుల రివ్యులతో దగాపడి థియేటరు బారిన పడ్డాను రక్తచరిత సినిమా కోసం.
కథ కథనాలు చర్చించడం ఈ పోస్టు ఉద్దేశం కాదు
అదేంటో హైదరాబాదులో అస్సలు టికెట్లే దొరకట్లేదు ఎక్కడ కెళ్ళినా అన్న so called hype విని. సత్య, శివ,గాయం, కంపెనీ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్డులని చేసే పడే సత్తా ఉన్న డైరెక్టర్ కదా అని ఆశతో అడుగుపెట్టిన నాకు అడియాసే ఎదురయింది. సినిమా మొదలైన అరగంటకు కూడా నేను తెలుగు సినిమాకు వచ్చానో డబ్బింగ్ సినిమాకు వచ్చానో నిజంగానే అర్ధం కాని అయోమయ పరిస్తితి కోట తప్పించి నాకు తెలిసిన నటి నట వర్గం ఎవ్వరు కనిపించకపోవడమే కారణమేమో,వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎం మాట్లాడుతున్నారా అని concentration తో వినాల్సిన పరిస్థితి కనీసం హిందీ వెర్షన్ కి వెళ్లి ఉంటే కాస్త nativity దక్కేది $2 డాలర్స్ కూడా! తినగా తినగా వేము తీయగుండు చూడగా చూడగా తెలుగు సినిమా డబ్బింగ్ అర్ధం అవుతునుండు అనుకుంటూ నాకు పెద్ద తేడ ఏమి కనిపించలే ఫ్లో కి అలవాటు పడిపోయా ఎంతైనా సగటు తెలుగు ప్రేక్షకున్ని కదా!
మార్కెటింగ్ తెలివితేటలూ పక్కన పెడితే వర్మ చాల తెలివిగా ప్రవర్తించాడు. సామాన్య జనాలకి పరిటాల రవి గురించి తెలిసింది అంటే రవి, సూరి సంఘర్షణే , ఆ అంశాన్ని ఏమాత్రం స్పృశించకుండా మొదటి భాగాన్ని $12 ముక్కు పిండి వసూలు చేసి ఇంటికి పంపించాడు చివరిగా పార్ట్ 2 promo తో,కొంచెం curiosity లెవెల్స్ పెంచే విధంగా.ఇంతోటి దానికి రెండో పార్టు చూడటం ఒకటి. నీ ఆటే వద్దంటే పట్టు చీర కట్టుకొస్తా అన్నట్టుగా. curiosity kills the cat అని నాకు తెలిసిపోయింది కదా కాస్త జాగ్రర్తగా ఉంటాను.
ఇందులో హై వోల్టేజి సీన్సు కూడా నాకేమి కనిపించలేదు ప్రేక్షకున్ని కట్టిపడేసే విధంగా, హీరో కొడవలి పట్టుకొని కనపడటం తప్ప. బుక్కా రెడ్డి పాత్రధారి మాత్రం బాగా విలనీ చూపించాడు.
అవునన్నట్టు వర్మ మాంచి strategist ఆండోయ్ , తానూ ఈ సినిమా తీసిన టైమింగ్ చూస్తె అర్ధం అవుతుంది. ఇటివల వరస ప్లాపులతో సతమతమవుతూ తానూ నడిచిన నల్లేరు నడకనే మల్లి చూపిద్దమనుకున్నాడు, జనాలకు వాళ్లకి ఏం కావాలో వాళ్ళకే అర్ధం కాని పరిస్తితుల మూలాన, TV9 చానెళ్ళ పుణ్యాన, ఖలేజా,బృందావనము హిట్టో ఫట్టో తేల్చుకోలేని కన్ఫ్యూజన్ ముమెంట్లో సైలెంటుగా సినిమా రిలీజు చేసేసాడు. తనకున్న మాటకారి తనన కావాల్సిన ఫ్రీ పుబ్లిసిటీ ముందుగానే సంపాయించుకొని ఓపెనింగ్స్ ఐతే సంపాయించు కున్నాడో, కుంటాడో. ఈ మూవీ ఆడక పోయిన వర్మకు వచ్చే నష్టం ఏమి లేదు ఉన్న 10 ఫ్లాపుల్లో మరొకటి వచ్చి చేరుతుంది, స్టార్ కాస్ట్ కి గాని సాంగ్స్ picturesation కి ఖర్చు చేసింది ఏమిలేదు.అందరు తెలీని మొహలాయే, పాటలు లేకపోయే గొప్పవి. ఆడిందా మొదటి రోజు నించి జమా ఖతాలోనే! i feel varma completed his best .
మరో విషయం మహా నటుడు NTR పాత్ర చిత్రీకరణ ఏ మాత్రం సరిగా లేదు. మహా నటుడి అభిమానులుకి మాత్రం కొంచెం కంటగింపుగానే ఉంటుంది. He was shown in bad light
సామి రంగా అస్సలు పాయింట్ మరిచానండి ఎన్ని చెప్పుకున్న ఈ అస్సలు విషయం చెప్పుకోకుంటే వ్రతం చేసి ఉద్యాపన చేయనంత పాపం, అదేనండి వర్మ వాయిస్ ఓవర్ . అది నిజంగానే ఓవర్ అయింది నాకితే అలానే అనిపించింది మిగిలిన వాళ్ళకి ఏమనిపించిందో తెలిదు కాని. అందుకే అన్నారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనీ దీనినే కొంచెం raw terminology లో ఒక సామెత ఉంది గుర్రం పని గుర్రం చేయాలనేసి మొత్తం చెప్పట్లేదు ఆ సామెత ఎందుకంటే వర్మ పాత సినిమాల గౌరవం నాలో ఇంకా మిగులుంది.ఏ మాత్రం impressive గా లేదు. ఈ సినిమా జష్ట వదిలించుకోవడానికి మూవీ చూశాక ఖలేజా టీవీ లో చూస్తే కాని కాస్త రిలీఫ్ కలగలేదు, పోస్టు రాయడం తో పాటు. ఇంతకూ మించి నాకు రాయడానికి ఇందులో ఏమి ఉందనిపించలేదు