నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Tuesday, July 3, 2012

నాలో ఓ సంఘర్షణ


        
ఆకలి గొన్న కడుపుతో అవతలి వాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చవచ్చు. పిడచకట్టిన గొంతుతో అవతలి వాడి దాహం తీర్చలేము.ప్రేమించలేని మనసుతో అవతలి వ్యక్తికి ప్రేమను పంచలేము ప్రేమను పొందలేము. మనిషి బతకడానికి ప్రేమ ఎందుకు కావాలి? అసలు ప్రేమ అంటే ఏమిటి? ఈ ప్రేమన్నది పలు సందర్భాలలో పలు రకాలుగా నిర్వచింపబడుతుంది, అయితే ఇందులో ఏది సరిఅయిన నిర్వచనం?  ఏది ప్రామాణికం? ఈ ప్రపంచంలో ABSOLUTE అన్నది ఏది లేదు. ప్రతిదీ RELATIVE కొలమానంలో నిర్దేశింపబడినదే. నిన్న సరి అనుకున్నది నేడు సరికాకపోవచ్చు. ఈరోజు ఇక్కడ సరి అనుకున్నది వేరేచోట అది సరి కాదేమో. ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతం.దాని ముందు మిగిలినవన్నీ దిగదుడుపే. 

ఈ ఆకలి ఏందీ, దాహం ఏందీ, ప్రేమ అంటున్నావు ప్రామాణికం ఇవ్వన్నీ HI-FI Terminology ఏం చెప్తున్నావు, ఏం రాస్తున్నావు.ఏమిటి ఈ అంతర్ సంఘర్షణ?  మనిషి ఎన్ని రకాల సంఘర్షణ ఎదుర్కున్నా తాను ఆనందంగా ఉండటం కోసమే. మరి ఈ ఆనందం అనేది మనిషికి బ్రహ్మపదార్ధం ఎలా అయింది. ఏం కావాలి మనిషి బతకడానికి. ఏం చేస్తే మనిషి ఆనందంగా ఉంటాడు. ఆలోచించడానికి ప్రతిదీ చిన్నదిగానే తోస్తుంది. కాని మనిషి ఎందుకు అనుకున్నవి పొందలేకున్నాడు. వీటన్నికి కారణభూతం మనిషి మస్తిష్కంలో ఉద్భవించే ఆలోచనలు. ఈ ఆలోచనలు ఇక్కడ నుంచి ఉద్భవించి తరంగాల్లా పది దిక్కులా మనిషి ఆలోచనల్ని కట్టి పడేస్తున్నాయి. ఒకటా రెండా పది వైపులా మనిషిని పది రాకాలుగా లాగేస్తే ఎటువైపు నుంచి విడుపించుకోలేక మనిషి vicious cycle లో ఇరుక్కొని ఈ సంఘర్షణ జీవితాంతం అనుభవిస్తూన్నాడనిపిస్తుంది. ఈ ఆలోచనల్ని ఒక్క చోట కేంద్రీకరించి వాటి మీద ఆధిపత్యం సంపాయించకున్నా అదుపులో ఉంచగలిగితే సార్ధకత సాదించినట్టే.మనిషి తాను ఆనందంగా లేకుండా పక్క వాడికి సంతోషం ఎన్నడు పంచలేడు. మనిషికి ఇవ్వన్నీ ఒకరు నేర్పిస్తే నేర్చుకునే పాఠాలు కావేమో. జీవిత యానంలో ఒక్కో మెట్టు దాటుకుంటూ స్వీయనుభావంతో నేర్చుకున్నవే కడదాక మిగిలి పోతాయి మరి కొందరికి దిశా నిర్దేశం చేస్తాయి.

Sunday, September 11, 2011

ఓ ఆశ

ఆకాశమనే ఓ పర్ణశాలను రంగులన్నీ అద్ది

ప్రపంచమనే వసుదైక కుటుంబానికి

పంచరంగుల అందాలను తోడుగా పంపి

చుట్టూరా ఆనందాలు నింపినా

అన్నీ ఉన్న మనసుకు తెలీలేని వెలితి

జీవితమనే పుస్తకానికి నేనున్నాను అంటూ

విడని నీడల్లే వెంటాడే అసంతృప్తి!



ఎంతున్నా ఎంతేత్తున్నా కడుపులోకి వెళ్ళేవి

నాలుగు వెళ్ళేలని కంటి నిండా కునుకే అని తెలిసి కూడా

పడి పడి లేచి పడి వడి వడిగా లేస్తూ పడుతూ ఆపని అంతులేని ఆరాటం



వేదనే వెంటాడినా వేరువని జీవితాన్ని ఒకటి చూడాలని నాకుంది

కోరికే ఉవ్వెత్తుగా ఎగసినా బోసి నవ్వుల చిన్ని పాపాయి నవ్వుల

సంతృప్తి మనసులో నింపుకొని సాగిపోవాలని కోరికుంది

స్వార్ధ చింతన, సంకుచితం,ఆవేదన, ఆక్రోశం మనషుల్లో లేకుండా ఉండే

ఒక్కనాటి ఆనందం రుచి చూడాలని ఆశైతే నాకుంది

హృద్యమైన ఓ ప్రేమ కథ

A short and sweet love story, heart touching

Tuesday, June 14, 2011

తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా!

పురాణాలలో యోగులు, చక్రవర్తులు లోక కళ్యాణ కాంక్షతో రాజ్యాన్ని, సంసార తాపత్రయాలు త్యజించి సంవత్స్తరాలు, సంవత్స్తరాలు తపస్సు ఆచరించేవారట! ఒక్కోసారి అవి వింటున్నప్పుడు పురాణాలూ నమ్మశక్యం కాని రీతిలో వర్ణించబడ్డట్టు మనసుకు తోస్తుంది. కారణం మనిషన్నవాడు తన గురించి ఆలోచించకుండా కేవలం పరుల కోసమే ఆలోచించడం ఎలా సాధ్యం అన్న మీమాంశ ఆ నిజాన్ని మనం నమ్మలేని విధంగా అలోచిoప చేసేటట్టు చేస్తుంది.
ఒక రోజులో కనీసం కొంతసేపైనా కేవలం అవతలి వాళ్ళకోసం ఆలోచించడం అన్నది ఉహకైనా అందుతుందా?మనల్ని ఆ స్థానంలో ఉహించుకుంటే 99 ,9 % మంది చివరి వరసలో చిట్ట చివర నిలిచే వాళ్ళమే.
ఈ సోది రామాయణం చాట భరతం ఎందుకంటే ఈరోజు చదివిన వార్త మనసుకు కదిలించి వేసింది.దాని సారంశం హరిద్వార్ కు చెందిన ఒక సాధుపుంగవుడు గంగా నది పరిరక్షణకు నడుం బిగించి నాలుగు నెలలుగా నిరాహార దీక్ష చేస్తూ గతించాడు.ఆ మహనీయుడు మరణించాక కాని మనకు ఈ వార్త తెలియలేదంటే ఏమనుకోవాలి.ఇది జరిగింది హిందుత్వ పరిరక్షణకే మేమున్నది అని బీరాలు పలికే BJP పాలిత రాష్ట్రంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే సామాన్యుడికి ఒరిగేది ఏమి లేదు. దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్టు మన మీద పడి కోట్లకు పడగలేత్తుతారు.మనం కూడా ఇంతకంటే చేయగలిగేది లేదు.ఎవడికో ఒకడికి ఓటు వేయడం తప్పించి.అందరూ ఆ విషవృక్షపు కొమ్మలే.
అప్పుడప్పుడు ఒక హజారే రాందేవ్ వచ్చి వారి శక్తి మేర పోరాడి నిష్క్రమిస్తారు.ఈ పరిణామంలో ఆ తరపు ప్రతినిధులు కోల్పోవడం తప్పించి.ఈ తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా.

http://timesofindia.indiatimes.com/india/Sadhu-dies-after-4-month-fast-to-save-the-Ganga/articleshow/8847216.cms

Thursday, March 10, 2011

బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివారు

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ so called ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై tankbund విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన exams .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

Thursday, February 24, 2011

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు
అవును మరి వాళ్ళు ఎత్తుకేళ్ళకుండా ఉంటె ఇంతటి నిజాయితీ ఉన్న ఐఏఎస్ లు ఇంకా మన దేశం లో ఉన్నారని తెలిసేదే కాదు. మన వార్తా పత్రికలూ కూడా ఎప్పుడు 360 కోట్లు అవనితి సంపాదన పొందిన ఐఏఎస్ ల గురించే హెడ్డ్ లైన్స్ లో ప్రచురించడం మాత్రమే తెలిసిన వార్తా పత్రికలకి ఒక నిజయితిపరుడైన అధికారి వార్త ప్రచురించే భాగ్యం కలిగి ఉండేది కాదు.
ఏదో ఒక AD లో మరక మంచిదే అని ఉంటుంది.మరక వల్ల ఏదైనా ఒక మంచి జరిగితే అది మంచిదే. అలానే ఈ నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళడం వల్ల యావత్ భారతావనికి అతని గొప్పదనం తెలిసే భాగ్యం కలిగింది. ఈ సందర్భం లో అక్కడి ప్రజానీకం తెలిపిన సంఘీభావం ఎంతో ముదావహం. అదే సమయంలో మీడియా కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు TRP ratings కోసం తాపత్రయ పడే వీళ్ళు ఇటువంటి అధికారులు చేసే మంచి పనులు వెలుగులోకి తీసుక రావడం లో ఎందుకు ముందు ఉండరు. ఈ వరవరరావు పనికి మాలిన రావులను ఎందుకు చూపించి జనాల BP లను ఎందుకు పెంచుతారో వారికే అర్ధం కావలి. వాళ్ల వల్ల ఒనకుడిన ఒక్క ప్రయోజనం ఎవరికైనా ఉందా. మైకు ముందు పనికిరాని పక్షపాత పూరిత వక్ర మాటలు తప్పించి.
ఓడిషా ప్రభుత్వం కూడా మరీ విషయాన్ని సాగదీయకుండా వల్ల డిమాండ్లు ఒప్పుకొని సమయోచితంగా ప్రవర్తించింది. ఇటువంటి నిజాయితీ అధికారుల్ని తాయారు చేయడం అంతటి సామాన్య విషయం కాదు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడుతారు.
I salute to Mr vineel krishna with high regard

Tuesday, February 15, 2011

ఎండమావిలో దాహం



సాగిపోతున్నా!
కనిపించే దారులు
కరిగిపోని ఇసుక తెన్నలు
మిగిలిపోఇన జ్ఞాపకాలు
గత జల సేతు బంధనమంటూ
అడుగులు సాగదీస్తూ
కాలం గడిపేస్తూ సాగిపోతున్నా!

ఉసులు మూగపోయిన సాయంత్రాన
చుక్కల్లో లెక్కలు నెమరు వేస్తూ
ప్రతిరోజు నను తాకిపోయే సంధ్య వెలుగు
తన గూడు చేరిందని తెలుసుకొని
భారమైన కనులు చేమ్మగిల్లడం మరిచిపోలేదని
ఉబుసుపోని మనసుకు
జోలపాట పాడి రోజులు సాగదీస్తున్నా !

ఒంటరి మనసుని బంధిచే పాశం ఉన్నదా
బహుదూరపు బాటసారికి దరిచేర్చే తీరం ఉన్నదా
మారనిదల్లా నిన్న నేడు ఆశలు రేపే రేపు అన్న ఒక గూడు మాత్రమే
తీరనిదల్లా ప్రతి తీరం వెంట ఎండమావిలో దాహం మాత్రమే