నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Sunday, September 11, 2011

ఓ ఆశ

ఆకాశమనే ఓ పర్ణశాలను రంగులన్నీ అద్ది

ప్రపంచమనే వసుదైక కుటుంబానికి

పంచరంగుల అందాలను తోడుగా పంపి

చుట్టూరా ఆనందాలు నింపినా

అన్నీ ఉన్న మనసుకు తెలీలేని వెలితి

జీవితమనే పుస్తకానికి నేనున్నాను అంటూ

విడని నీడల్లే వెంటాడే అసంతృప్తి!



ఎంతున్నా ఎంతేత్తున్నా కడుపులోకి వెళ్ళేవి

నాలుగు వెళ్ళేలని కంటి నిండా కునుకే అని తెలిసి కూడా

పడి పడి లేచి పడి వడి వడిగా లేస్తూ పడుతూ ఆపని అంతులేని ఆరాటం



వేదనే వెంటాడినా వేరువని జీవితాన్ని ఒకటి చూడాలని నాకుంది

కోరికే ఉవ్వెత్తుగా ఎగసినా బోసి నవ్వుల చిన్ని పాపాయి నవ్వుల

సంతృప్తి మనసులో నింపుకొని సాగిపోవాలని కోరికుంది

స్వార్ధ చింతన, సంకుచితం,ఆవేదన, ఆక్రోశం మనషుల్లో లేకుండా ఉండే

ఒక్కనాటి ఆనందం రుచి చూడాలని ఆశైతే నాకుంది

హృద్యమైన ఓ ప్రేమ కథ

A short and sweet love story, heart touching

Tuesday, June 14, 2011

తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా!

పురాణాలలో యోగులు, చక్రవర్తులు లోక కళ్యాణ కాంక్షతో రాజ్యాన్ని, సంసార తాపత్రయాలు త్యజించి సంవత్స్తరాలు, సంవత్స్తరాలు తపస్సు ఆచరించేవారట! ఒక్కోసారి అవి వింటున్నప్పుడు పురాణాలూ నమ్మశక్యం కాని రీతిలో వర్ణించబడ్డట్టు మనసుకు తోస్తుంది. కారణం మనిషన్నవాడు తన గురించి ఆలోచించకుండా కేవలం పరుల కోసమే ఆలోచించడం ఎలా సాధ్యం అన్న మీమాంశ ఆ నిజాన్ని మనం నమ్మలేని విధంగా అలోచిoప చేసేటట్టు చేస్తుంది.
ఒక రోజులో కనీసం కొంతసేపైనా కేవలం అవతలి వాళ్ళకోసం ఆలోచించడం అన్నది ఉహకైనా అందుతుందా?మనల్ని ఆ స్థానంలో ఉహించుకుంటే 99 ,9 % మంది చివరి వరసలో చిట్ట చివర నిలిచే వాళ్ళమే.
ఈ సోది రామాయణం చాట భరతం ఎందుకంటే ఈరోజు చదివిన వార్త మనసుకు కదిలించి వేసింది.దాని సారంశం హరిద్వార్ కు చెందిన ఒక సాధుపుంగవుడు గంగా నది పరిరక్షణకు నడుం బిగించి నాలుగు నెలలుగా నిరాహార దీక్ష చేస్తూ గతించాడు.ఆ మహనీయుడు మరణించాక కాని మనకు ఈ వార్త తెలియలేదంటే ఏమనుకోవాలి.ఇది జరిగింది హిందుత్వ పరిరక్షణకే మేమున్నది అని బీరాలు పలికే BJP పాలిత రాష్ట్రంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే సామాన్యుడికి ఒరిగేది ఏమి లేదు. దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్టు మన మీద పడి కోట్లకు పడగలేత్తుతారు.మనం కూడా ఇంతకంటే చేయగలిగేది లేదు.ఎవడికో ఒకడికి ఓటు వేయడం తప్పించి.అందరూ ఆ విషవృక్షపు కొమ్మలే.
అప్పుడప్పుడు ఒక హజారే రాందేవ్ వచ్చి వారి శక్తి మేర పోరాడి నిష్క్రమిస్తారు.ఈ పరిణామంలో ఆ తరపు ప్రతినిధులు కోల్పోవడం తప్పించి.ఈ తోలుమందం జీవితం ఇలానే నడుస్తుంటుంది కడుపులో చల్ల కదలకుండా.

http://timesofindia.indiatimes.com/india/Sadhu-dies-after-4-month-fast-to-save-the-Ganga/articleshow/8847216.cms

Thursday, March 10, 2011

బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివారు

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ so called ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై tankbund విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన exams .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

Thursday, February 24, 2011

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు

నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళి మంచి పనే చేసారు
అవును మరి వాళ్ళు ఎత్తుకేళ్ళకుండా ఉంటె ఇంతటి నిజాయితీ ఉన్న ఐఏఎస్ లు ఇంకా మన దేశం లో ఉన్నారని తెలిసేదే కాదు. మన వార్తా పత్రికలూ కూడా ఎప్పుడు 360 కోట్లు అవనితి సంపాదన పొందిన ఐఏఎస్ ల గురించే హెడ్డ్ లైన్స్ లో ప్రచురించడం మాత్రమే తెలిసిన వార్తా పత్రికలకి ఒక నిజయితిపరుడైన అధికారి వార్త ప్రచురించే భాగ్యం కలిగి ఉండేది కాదు.
ఏదో ఒక AD లో మరక మంచిదే అని ఉంటుంది.మరక వల్ల ఏదైనా ఒక మంచి జరిగితే అది మంచిదే. అలానే ఈ నక్సలైట్లు వినీల్ కృష్ణని ఎత్తుకెళ్ళడం వల్ల యావత్ భారతావనికి అతని గొప్పదనం తెలిసే భాగ్యం కలిగింది. ఈ సందర్భం లో అక్కడి ప్రజానీకం తెలిపిన సంఘీభావం ఎంతో ముదావహం. అదే సమయంలో మీడియా కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు TRP ratings కోసం తాపత్రయ పడే వీళ్ళు ఇటువంటి అధికారులు చేసే మంచి పనులు వెలుగులోకి తీసుక రావడం లో ఎందుకు ముందు ఉండరు. ఈ వరవరరావు పనికి మాలిన రావులను ఎందుకు చూపించి జనాల BP లను ఎందుకు పెంచుతారో వారికే అర్ధం కావలి. వాళ్ల వల్ల ఒనకుడిన ఒక్క ప్రయోజనం ఎవరికైనా ఉందా. మైకు ముందు పనికిరాని పక్షపాత పూరిత వక్ర మాటలు తప్పించి.
ఓడిషా ప్రభుత్వం కూడా మరీ విషయాన్ని సాగదీయకుండా వల్ల డిమాండ్లు ఒప్పుకొని సమయోచితంగా ప్రవర్తించింది. ఇటువంటి నిజాయితీ అధికారుల్ని తాయారు చేయడం అంతటి సామాన్య విషయం కాదు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడుతారు.
I salute to Mr vineel krishna with high regard

Tuesday, February 15, 2011

ఎండమావిలో దాహం



సాగిపోతున్నా!
కనిపించే దారులు
కరిగిపోని ఇసుక తెన్నలు
మిగిలిపోఇన జ్ఞాపకాలు
గత జల సేతు బంధనమంటూ
అడుగులు సాగదీస్తూ
కాలం గడిపేస్తూ సాగిపోతున్నా!

ఉసులు మూగపోయిన సాయంత్రాన
చుక్కల్లో లెక్కలు నెమరు వేస్తూ
ప్రతిరోజు నను తాకిపోయే సంధ్య వెలుగు
తన గూడు చేరిందని తెలుసుకొని
భారమైన కనులు చేమ్మగిల్లడం మరిచిపోలేదని
ఉబుసుపోని మనసుకు
జోలపాట పాడి రోజులు సాగదీస్తున్నా !

ఒంటరి మనసుని బంధిచే పాశం ఉన్నదా
బహుదూరపు బాటసారికి దరిచేర్చే తీరం ఉన్నదా
మారనిదల్లా నిన్న నేడు ఆశలు రేపే రేపు అన్న ఒక గూడు మాత్రమే
తీరనిదల్లా ప్రతి తీరం వెంట ఎండమావిలో దాహం మాత్రమే

Monday, February 7, 2011

ఓడి గెలిచిన చిరంజీవి

అనగనగా ఒక సారు, ఆయన దగ్గర కోటాను కోట్లు సంపద ఉంది ప్రజాబలము ఉంది. కావలసినంతా వందమాగధులు ఉన్నారు. ఏదో చేయాలనీ ఆయన మనసు ఎంతకాలం నుంచో ఉవ్విళ్లూరుతోంది కాని ఏమి చేయాలో ఆయనకు పాలు పోలేదు.చేయల్సిందతా చేసేసాడు, కొడుక్కి, తమ్ముడిని మండలాలు పంచిచ్చేసాడు. ఇన్ని ఉన్నచోట బట్రాజు గణానికి కొదవే లేదు. ఇంతకంటే లాభసాటిగా ఒక కంపెనీ పెట్టు సారు దానిలో లాభపడ్డ వారే కాని పడిపోయిన వాళ్ళేవ్వరూలేరు. నిజమేనని నమ్మాడు అమాయక చక్రవర్తి. నమ్మకేమి చేస్తాడు ఏదో ఒకటి చేయాలన్న తొందర ఆయనలో చాల ఉంది. పైగా live examples కూడా చాలానే ఉండనయే, అంతకు మునుపు ఒక అన్న కూడా ఇలానే ఒక చక్రం కూడా తిప్పడాయే! ఆయన 9 నెలల్లో చేస్తే నీవు 8 చేస్తావన్న వాళ్ళే ఎక్కువయ్యారు. ఇంకేంటి అమ్ములపొది సిద్దం చేసుకున్నాడు సామాజిక అంశం, ప్రేమే దైవం సేవే లక్ష్యం వందకు వంట చెరుకు ప్రోడుక్ట్స్ అన్ని సిద్దమయ్యాయి


ఇదంతా ఒక రెండేళ్ళ ముందటి కథ. రేపెవ్వడు చూడోచ్చాడు. కలలు కల్లలయ్యాయి. ఓడలు బండ్లు అయ్యాయి.కన్న కలలన్ని కుదేలయ్యాయి. టైటానిక్ సినిమా చూడలనుకుంటాడు కాని టైటానిక్ షిప్ లో ఎవ్వడు ప్రయాణించాలనుకోడు కదా అదే జరిగింది. పెట్టిన కంపెనీ ఢమాలయ్యింది . ఉన్న సరకు మురుగుపోతోంది ఏం చేయాలో తోచలేదు. రంగు పడి రంగు బారిన మొహం, మద్య మద్యలో రంగు వేసుకున్నోళ్ళు ఆకాశామార్గంలో విహరించడం కూడా మనసుకు ఉండబట్టకుండా చేసింది.పది దార్లు మూసుకపోతే ఒక దారి దేవుడు తెరుస్తాడాంట, ఊపిరి ఆడటానికి. ఎవరి కంపెనీకి పోటిగా తను దుకాణం తెరిచాడో ఆ పెద్ద కంపనీలో మేనేజర్ పోస్ట్ ఒకటి కాళి అయ్యింది అని తెలిసిందీ తడవుగా తొంగి చూడటం మొదలెట్టాడు. నీ స్థాయికి తగింది కాదన్నయ్య అనే చెప్పే వాడెవ్వడు లేకపోయే. ప్రతి ఒక్కడు బతకలేక బడిపంతులన్నట్టు గాలివాటంగా వచ్చిన వాడే కాని ఒక ఆలోచన పరుడే ఉంటే కదా.చెప్పే వాళ్ళే లేరు బట్రాజులు తప్ప. ఉన్నవాళ్లు ఎప్పుడో పోయారు, అదీ కాక రంగు వేసుకున్న మొహం కదా ఎక్కువ కాలం రంగు వేసుకోకుండా ఉండలేదు.రంగు వేసుకున్నప్పుడు అదికాక ఏదో వేరేది చేయాలన్న ఉబలాటం, కంపెనీ పెట్టాక రంగు వేయాలన్న ఆరాటం. ఎప్పుడు రెండు పడవల మీద కళ్ళు పెట్టే నైజమే! నీ ఆటే వద్దంటే పట్టుచీర కట్టుకోస్తా అని మొత్తానికి రంగ ప్రవేశం చేసాడు. అమ్ముడుపోని సరుకు అమ్మేశాడు. కాదు నమ్మకాన్ని వమ్ము చేసాడు. తిక్క సన్యాసులు అనుచరగణం.వాళ్ళకు మిగిలింది చిప్పే! కొట్లాటకు పుట్ట్లిలైన కాంగిరేసు కుటంబంలో కొత్త కాపురం మొదలెట్టిన ex ప్రజారాజ్యం గణానికి రాజ్య బాగం దక్కునో లేక ప్రజల్ని సామాజిక న్యాయం చేయమని ఈ అనుచరగణానికి ఇచ్చేసి రాజ్యాన్ని కాంగీయులు పంచుకుంటారో, వేచి చూడాలి.

ఒకానొక నాడు జెండా పీకేద్దాం అని శీర్షిక చూసి ఆంధ్రజ్యోతి పత్రిక ముందు నానా యాగీ చేసింది ఈ జనాలే. ఆత్మాహత్య సదృశమన్నట్టు పత్రికల మీద కారాలు మిరియాలు నూరింది ఈ నాయకుడే. హూట్!!!!! ఇంత తేలికగా మరి ఇంత ప్రయత్నలేమితో ఒక నాయకుడు ఓడిపోవడం సిగ్గుచేటు.ఇంతోటి నాయకుణ్ణి తివాసీలు వేసి నాయకత్వం అప్పగించడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే. ఎవడైనా కంపెనీ CEO కంపెనీ మూసేసి opponent కంపెనీ లో మేనేజర్ పోస్ట్ కి సరిపెట్టుకున్నట్టుంది వ్యవహారం. కందకు లేని దురద కత్తి పీటకున్నట్టుగా అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్లో వార్తలు కోసమెళ్లి అరగంట Ad ప్రోగ్రామ్స్ చూసి వళ్ళు మండి వార్తలు ఆపినట్టు పోస్ట్ రాసి చల్లార్చుకోవడమే!