నా మనసు చెబుతోంది ఓ మనోగతం

Wednesday, July 21, 2010

బాబు బాబ్లీయం

ఉగ్రవాదులు దాడులు తెగపడుతుంటున్నప్పుడు ఆక్రోశం కలుగుతుంది. మొన్న బాబ్లీలో జరిగిన దుశ్చర్య చూసి వాళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం అడియాసే అనిపిస్తుంది. కొందరికి ఇది బహుశా అతిశయోక్తి అలంకారం అనిపించి ఉండొచ్చు. మరికొంతమందికి ఒక అడుగు ముందుకు వేసి బహుశ నేను తెలుగుదేశం సానుభూతిపరుణ్ణీ కూడా అయిఉంటాను. బాబు బాబ్లీ యాత్ర చెపట్టిన టైమింగ్ సబబా కాద దానిలొ సరిపాళ్ళు ఎంత అన్న అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. రాజకీయం అంటేనే ఒక అవకాశవాదం, వాళ్ళ నుంచి నేను అంతకన్నా ఆశించలేను బహుశా ఈ అడుగు దాటి మరో ఆలోచన చేయడానికి ఇది excuse కాదనుకుంటా!రాజకీయ నాయకులు సామన్య ప్రజానీకానికి ఆ విధంగా expectations, bench marks ఆల్రేడీ set చేసేసారు.

ఏదేమైనప్పడికి మహారాష్త్ర ప్రభుత్వం పాల్పడిన ఈ నియంత్రుత్వ పోకడలు నా ఊహ ఎరిగి కనీవినీ ఎరగను. రాజ్యంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో వ్యవహరించిన తీరు అందులోనూ మహిళా ప్రతినిధులతో అవమానించిన తీరు గర్హనీయం.మనలో మనకే ఇంత విద్వేషాగ్ని ఉన్నప్పుడు శత్రుదేశం అయిన పాకిస్థాను ఆ విధంగా దాడులు తెగబడటం వాళ్ళనుంచి మంచి ఆశించడం అత్యాశే.

ఇక్కడ జరిగిన ఈ సంఘటన నేటి రాజకీయాలలో కొత్త పోకడలకు నాంది. ఇది ఒక trend setter అయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది.మొన్న YSR చనిపోతే ఎందరో గుండెపోటుతో పోయారు.నిన్న బాబు అరెస్టు వార్త విని అదే గుండెపోటుతో చనిపోయారు.ఏంజరుగుతుందిక్కడ అని హరిక్రిష్ణ అన్నట్టు అరవాలనిపిస్తుంది కాని నేను రాజకీయ నాయకుడిని కానే.దేశం నాయకుల్ని ఎన్ని రకాలుగా అవమానించరో ఇక్కడ ప్రస్తావించడం చాట భారతాన్ని reprint చేసినట్టవుతుంది.
ఒక సమస్యను పలు రకాలుగా పరిష్కరించవచ్చు.ఆ మూఢులు దండం దశగుణం భవేత్ అని ప్రయొగించారు.ఇంత జరుగుతున్నా ఇక్కడ ప్రభుత్వం చేష్టలూడి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తీవ్రమైన ఆశ్చర్యం కల్గిస్తుంది.రోశయ్య వాక్పటిమ అసెంబ్లీ లోనే కానీ ఒక కీలక తరుణంలో నిర్ణయలేమి ఆయన తత్వమో లేక నిస్సహయతనో లేక కాంగ్రెస్సు వాది కాదనో!

మన కేసియార్ కేమో ఎడారి భూమి అయినా సరే దానిపై తెలంగాణ అని బోర్డు చూసుకునే చాలు ఆయన జీవిత కాల స్వప్నం నెరవేరినట్టే రాజినామా కాకుండా ప్రజోపయోగ కరమైన ఉద్యమాలు ఏమి చేసాడొ నేనెరగను.
మొన్నటికి మొన్న సోంపేట లోనూ అదే తంతు.మన వాళ్ళను మనమే శిక్షించుకుంటున్నాం.మనం మావోయిస్టులను అంటున్నాం మనలోనే దాగున్న మావోయిజం గుర్తించలేకపోతున్నాం.ఎవరెవరి శక్తానుసారం వాళ్ళ సామర్ద్యాల అణుగుణంగా ఆటవిక న్యాయం చేయడమే మారుతున్న రాజకీయల అర్ధం అనుకుంటా!

5 comments:

tarakam said...

in democracy what ever our representatives do they reflect the hopes&aspirations of people.what ever the motives are they have got the right to peacefully demonstrate&publicly agitate.there is no necessity for the kind of police atrocities committed on our representatives.congress leaders should unconditionally apologise to the telugus

మేఘ said...

That is very true.But unfortunately today's democracy changing its definition

శరత్ కాలమ్ said...

మీ బ్లాగు పేరుకి తగ్గట్టుగా టెంప్లేట్ - ఓ అందమయిన అమ్మాయి ఆలోచిస్తున్నట్లుగా - బావుంది.

మేఘ said...

thank you - శరత్ 'కాలమ్'

HarshaBharatiya said...

చాలా బాగా చెప్పారు
babli ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లేతేడ్ సిగ్గులేని నాయకులూ ఏం పికుతునారో
కరెక్ట్ గా చెప్పారు కెసిఆర్ కి రాజీనామాలు చేయటం తప్ప ఇంకేం తెలుసు ఏం చేస్తునాడో బాబ్లి ప్రాజెక్ట్ కడుతుంటే