ఎప్పుడైనా పేపర్ చదివినపుడు ఎప్పుడు అర్ధం కాని విషయం ఏమైన ఉంది అంటే రాజకీయ నాయకులు నా వాఖ్యలు వక్రీకరించారు అని ఒక statement ఇచ్చినపుడు. అదేంటో వాళ్ళేపుడు mediaకి అర్ధం అయ్యే వాఖ్యనాలు చేయరెందుకో!
ఈ మధ్య మా మిత్రుడొకరు India కి వెళ్ళడం జరిగింది. విషయాలు చెప్పుకొస్తూ హైదరాబాదు Ameerpet గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడెవరు అక్కడ coaching తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కనిపించడం లేదు అని విన్నప్పుడు ఔరా కాలం ఎంతగా మారిపోయింది అని అప్పుడనిపించింది.US లొ ఇప్పుడున్న తెలుగు జనాభలో నూటికి తొంభై మంది హైదరాబాదు Ameerpet లొ నడక నెర్చుకొని వచ్చారంటె అతిశయోక్తి లేదేమో.
2000 DOTCOM bubble burst ని కూడా తట్టుకొని నిలబదగలిగింది కానీ ఈ ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుప్పకూలిపోయింది ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి ఆ center ఎంత busy గా ఉండేదో. ఉదయం పూట tiffin centers హడవిడి మొదలుకొని road లొ నడిచె వెళ్ళేవాళ్ళకు వొద్దొన్నా pamphlet ఇచ్చేవాళ్ళ జీవనోపాది ఏమైందో కదా. కాలగమనంలో ఇవన్ని మాములేనేమో.
మొన్నామధ్య ఒక పాట వినడం జరిగింది, నేను మాములుగా పాటలు తక్కువే వింటాను అది విన్నాక మళ్ళీ మళ్ళీ వినకుండ ఉండలేకపోయా. Current సినిమా లో అటు నీవే ఇటు నీవే అనే పాట.. ఇదేమి పెద్ద సంగతి కాకున్న మనకు నచ్చిన విషయం పదిమందితొ పంచుకునే ఆనందమే వేరుగా!
ఇంకేమి ఆసక్తికర విషయాలు ఏమీ లేవు .. సెలవా మరి!
Sunday, September 13, 2009
కొన్ని కబుర్లు అవీ ఇవీ ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment